ట్యాంక‌బండ మీద మార్చి 10 న జరిగిన సంఘటనలకు కారణం ముమ్మాటికీ మీరే..మీరే..మీరే..! తప్పదు ఆ అపనింద, మీరు మోయాల్సిందే..!! మీరు చేసిన పనివలన  ఇప్పుడు తెలంగాణ పోరాటయోధుల మీద ఎన్ని అభాండాలో.. ఎన్ని అపనిందలో..బయటి ప్రపంచంలో ఎన్ని చీత్కారాలో.. చూశారా..??  మీరు ఎంతో మక్కువతో, ప్రీతితో ప్రతిష్టింప చేసిన విగ్రహాల వలన ఎంత మందికి ఎన్నిరకాల అవమానాలో గమనిస్తున్నారా..? ముఖ్యంగా 600 మంది తెలంగాణ అమరవీరులు ప్రాణత్యాగం చేసిన పోరాట స్పూర్తి  మీద నిన్న జరిగిన ఈ విగ్రహాల దాడి ఎంతటి మాయన మచ్చలా మిగిలిందో..చూడండి..!!

     
        అవును మహానుభావ..!  తమరు ఎంతో మక్కువతో ప్రతిష్టింప చేసిన ఆ విగ్రహాల మూర్తులు " మేము మరణించాక మా శిలావిగ్రహాలను రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టించండి "  అని మిమ్మల్ని గాని లేక మరెవరితోనైనా విన్న వించుకున్నారా..?  లేదే..!!  పాపం వారేదో వారి జీవితంలో వారికి తోచినది.. తాము అనుకున్నది పట్టుదలతోనూ..  అకుంఠిత దీక్షతోనూ.. సమాజంలో జరగుతున్న అవతవకల మీద పోరాడి సమాజ శ్రేయస్సుకోసం తమ జీవితాన్ని అంకితం చేశారు.. అది తమ విది అనుకున్నారు.  అంతే గాని.. తమ తదనంతరం తమ రూపాలతో విగ్రహాలు చేయించి..పూజించ బడాలని కోరుకోలేదే..? కనీసం అలాంటి తలంపు కూడ వారి మదిలో మెదిలిండదు..! మరెందుకయ్యా వారి ప్రతిరూపాలని చెక్కించి ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టించి.. చివరికి ఇప్పుడు ఇలా కొంతమంది " పోరాట యోధుల " చేత పెకలింపబడి నడిరోడ్ మీద మెడకు తాళ్లేసి ఈడ్చి హుస్సేన్‌సాగర్‌లో పడేలా చేశారు..??  

    పాపం అన్నమయ్య ! తనకే ప్రాంతీయ, కుల భేదాలు లేని మనిషి. తనేదో భక్తి పారవశ్యంలో కొన్ని వేల పాటలు రాసి వాటికి బాణీలు కట్టి  తెనుగుకే శోభ తెచ్చి తన సాటి తెలుగువారందరికీ ఎన్ని తరాలైన తరగని మరువలేని సంగీత అమృతాన్ని అందించారు. అంతమాత్రాన 600 మంది ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కంటే అన్నమయ్య గొప్పవాడా..?

     ఎర్రాప్రగడ.. పాపం పిచ్చోడు..!  ఆయనెప్పుడు అనుకొని వుండరు.. తను మహాభారతంలో కొన్నిపర్వాలను తెనుగులోకి అనువాదం చేసిన పాపానికి తన ప్రతిమతో ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టింపబడి  కొంత మంది త్యాగధనుల చేత ముక్కలు ముక్కలుగా గావించబడతానని...!!.  ఇక  " తెలుగదేలయన్న దేశంబు తెలుగేను... దేశభాషలందు తెలుగు లెస్స " అని పలికిన పాపానికి పక్క రాష్ట్రం వాడు.. పరాయి భాషకు చెందిన శ్రీకృష్ణదేవరాయలును సైతం వదలలేదు..మన త్యాగమూర్తులు.!  మనల్ని ఎంతోగాను గౌరవించిన మనిషిని మనం గౌరవించిన తీరు..బేష్..చాలా బాగుంది.  ఇలా ఒకరేమిటి.. గుఱ్ఱం జాషువా..బళ్లారి రాఘవ. విప్లవాలకు ఆనవాలైన శ్రీశ్రీ. ఆదికవి నన్నయ భట్టు. త్రిపురనేను రామస్వామి చౌదరి. సమాజంలోని సాంఘీక దురాచాలాను రూపుమాపేందుకు కృషి చేసిన సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం.మువ్వగోపాల పదాలను మురిపెంగా ఆలపించిన క్షేత్రయ్య. ఇలా ఎందరో వైతాళికులకు అవమానం జరగడానికి కారణం మీరు కాదా యన్.టి.ఆర్ గారు..??

     అంతే కాదు  మీరు గాని ఆ విగ్రహాలను ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టింప చేయకుండ వుండుంటే వాటి మీద దాడి చేసే అవసరమే  తెలంగాణ పోరాటయోధులకు వచ్చుండేది కాదు. వారి మీద అన్ని అపనిందలు వచ్చుండేవి కావు..!   ఆ తప్పంతా మీదే..మీదే...యన్.టి.ఆర్ సారూ....!! మీది కాదంటారా..?  కాదంటారా..? కాదేమోనా..!! అదెలా..? లోతుగా ఆలోచించాలా..!!  కూసింత లోతుగా ఆలోచిస్తే ....నిజమే తప్పంతా మీది కాకపోవచ్చు..!  తప్పంతా మీలో ఉన్న సంస్కారానిది, మన తెలుగువాళ్లు అని తలించిన మీ కృతఙ్ఞతది,  అవును మాస్టారూ.. తెలుగుజాతికి స్పూర్తి ప్రధాతలై, పధనిర్దేశుకులై, దృవతారలగ నిలిచి మానవ చరిత్రకు రూపకల్పన చేసిన మహనీయులను స్మరించుకోవడం, గౌరవించుకోవడం మన కర్తవ్యం అనుకొన్న మీ ఔనత్యానిది సర్ తప్పంతా....!  ఒక విషయం గమనించారా..! ఈ సంఘటన జరగకమునుపు వరకు ట్యాంక్‌బండ్ మీద ఉన్న మహనీయ విగ్రహాలు చూసినప్పుడల్లా  " ఆహా యన్.టి.ఆర్ ఎంత మంచి పని చేశారు. తన రాజకీయచరిత్ర ఎలా ఉన్నా "  అని అనుకునేవాడిని, కాని ఇప్పుడూ ఈ సంఘటన జరిగాక మీ మీద నింద మోపాల్సి వస్తున్నది. చూశార..!!  నిన్నటివరకు మంచి అనుకున్నది కాలంతో పాటూ మారుతూ ఈ రోజు చెడు అవుతున్నది..నిన్నటి దినం చెడు అనుకున్నది  ఈ రోజున మంచి అవుతున్నది.  తెలుగు భాష మీద, వైతాళికుల మీద మీకున్నంత  అభిమానం. కృతఙ్ఞత,  అభిలాష సాటి తెలుగువారమైన మాకు లేవు సర్.. మాకు ఏ చరిత్రా అవసరం లేదు..ఏ మహనీయులు అవసరం లేదు...! మా సంకుచిత భావాల ముందు మీ మహనీయుల విలువ ఎంత..? మాకు కావలసింది కేవలం మా వ్యక్తిగత క్షేమమే.. వ్యక్తిగత అభివృద్దే..! మా వ్యక్తిగత ఆకాంక్ష కన్నా ఏ మహనీయులు గొప్పవారు కారు. కావాలనుకొంటే మీరు చెబుతున్న ఆ మహనీయుల్లోని వ్యక్తులను మేము కులాలవారిగా, ప్రాంతాల వారిగా, మతాల వారిగా విడదీసి పంచుకొని గౌరవిస్తాము. కనీసం మీరు ఆ విదంగా సంతృప్తి పడండి మాస్టారు. అంతెందుకు సార్ ఎవరన్న ఒక విశిష్ట వ్యక్తిని తీసుకుందాము, మేము అతనిలో వున్న ప్రతిభనో లేక  వ్యక్తిత్వాన్నో చూసో గౌరవించం, ఆ వ్యక్తి యెక్క కులాన్ని చూసో లేక ప్రాంతాన్ని చూసో ఆ మనిషి యెక్క ప్రతిభను గుర్తించి గౌరవిస్తాము. అది మా తత్వం. ఆ ప్రాతపదికగనే మహనీయులను పంచుకుంటున్నాము కూడా. అంతెందుకు ఇప్పటికీ మిమ్మల్ని కూడ ప్రాంతీయ, కులాల ప్రాతిపదికంగా చూస్తూన్నాము అంతే కాని.... ఒక తెలుగువాడిగా దానికన్నా ముందు కళారంగంలో ప్రతిభావంతుడైన ఒక విశిష్ట వ్యక్తిగా గుర్తించటం లేదు... ఇది ముమ్మాటికి నిజం.
 
     అయినా మీ పిచ్చిగాని మాస్టారు, ప్రస్తుత ప్రపంచీకరణ ఆర్థిక సరళీకృత విధానాలలో కొట్టుకుపోతూ మమ్మల్ని మేమెప్పుడో కోల్పోయి చాలా కాలం అయ్యింది, మాకు మా మూలాలు ఏవీ అవసరము లేదు. దేశంలోనికి, రాష్ట్రంలోకి ఏ కొత్త ప్రక్రియ వచ్చినా పోలోమంటూ ఒక " గొర్రె " దాటులా వెళ్తున్నాము. మెమెప్పుడో పరాయికరణ చెంది వున్నాము మా ప్రస్తానమంతా ఒక వ్యాపారం దిశగా ఒక వ్యక్తిగత లాభాపేక్ష దిశగా సాగుతున్నది.  వీటి మద్యలో మీరింకా మహనీయులు.. మహాత్మలంటూ ప్రాకులాడితే ఎలా మాస్టారూ...?

   ఇంతజరిగినా.. ఇప్పటికి మీరు మహనీయులుగా భావిస్తున్న ఆ విగ్రహాలను  " వట్టి విగ్రహాలు "  గానే చూస్తున్నాము. మరి వట్టి విగ్రహాలు అని తెలిసీ ఎందుకు వాటిని ద్వంసం చేసామో అని మమ్మల్ని మేము ప్రశ్నించుకునే సంస్కారం మాలో కనపడట్లేదు...!  అవి వట్టి విగ్రహాలు కాదని మాకూ తెలుసు ఆ విగ్రహాలు వెనుక కొన్ని భావాలు, ఆరాధనలు వున్నాయని తెలుసు.. ఆ విగ్రహాలు మాటున మీ భావాలను ఆరాధనలు విద్వేషంతో ద్వంసం చేయాలన్న ఉద్దేశంతోనే చేశాము... అయినా మేము వాటిని " వట్టి విగ్రహాలు " అనే బుకాయిస్తాము. విగ్రహాలు కావాలనుకుంటే మళ్లీ పునర్‌నిర్మించుకోవచ్చు అదే 600 మంది ప్రాణాలు తిరిగి తేగలమా ? నిజమే పోయిన ప్రాణాలు తిరిగి తేలేమూ..!! అదే విదంగా విద్వేషంతో విగ్రహాలను ద్వంసం చేసి తిరిగి మళ్లీ పునర్‌నిర్మించుకోగలమూ కాని ఆ ద్వంసరచన చూసి గాయపడి ముక్కలైన కొందరి మనుషుల భావాలను మళ్లీ అతికించుకోగలమా..?  అయినా పోయిన ప్రాణాలకూ ఈ విగ్రహాల విద్వంసానికి లంకె ఏమిటి..?  అది సరే మాస్టారు 600 మంది ఆత్మార్పణం చేసుకొన్న అమరవీరులెక్కడ..! కేవలం పుట్టారు కాబట్టి ఏదో కొన్ని పనులు చేసినందుకే  మహనీయులని ఒక ట్యాగ్ తగిలించిన ఆ పాతకాలపు మనుషుల విలువ ఎక్కడ..? వారికి వీరికి పోలికేంటి..!! వారేమన్న ఆత్మార్పణం చేశారా..? లేక సాధించుకోవడం చేతకానప్పుడు ఎమోషన‌ల్‌గా బెదిరించడానికి ప్రాణత్యాగం చేశారా...చెప్పండి..? మా 600  మంది అమరవీరుల ప్రాణాలు పోయాయి కాబట్టి మేము దానికి బదులుగా ఎన్నో విద్వంసాలు చేస్తాము.. అది మా హక్కు..దాన్ని కాదనడానికి ఎవరికీ ఏ హక్కు లేదు... అర్హతా లేదు.

   అయ్యా యన్.టి.ఆరూ అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వివాదలతో ముగిసింది మీ మరణం..!  దానిగురించి పెద్ద పేచీ లేదు కాని, మీరింకా ఇప్పటి వరకు బ్రతికే ఉండుంటే ఈ సంఘటన చూసి మీ గుండె పగిలి మరిణించేవారు.. దీని కన్నా అప్పటి మరణమే మేలనపిస్తుంది.. ఇలాంటివి చూడకూడదనే మీరు ముందుగానే స్వర్గస్థులైనారు, అంతకన్న అదృష్టం ఎవరికుంటుంది..! శుభం......

     రాష్ట ప్రభుత్వం వారికి నాదో విన్నపం :  అయ్యా ఘనత వహించిన ముఖ్యమంత్రిగారు, ప్రభుత్వ అధికారుల్లారా..! ఇప్పటికైనా మించిపోయినది ఏమి లేదు.. విద్వంసం తర్వాత ఇంకా మిగిలిన కొన్ని విగ్రహాలు ట్యాంక్‌బండ్ మీదనే వున్నాయి.. ఆ మిగిలిన విగ్రహాలను కూడ దయచేసి అక్కడనుండి పెకలించి ఏ గోదాములలోనో లేక మీ ప్రభుత్వ కార్యాలయ స్టోర్ రూములలొనో పడేయండి.. అక్కడన్న మనస్సాంతిగా వుంటాయి. ఆ మహనీయులు తమ తదనంతరం ఏ కీర్తిని కోరుకోలేదు, ఏ విగ్రహాలు తయారు చేయాలని కోరుకోలేదు.. ఏదో తమ వంతు చేయవలసిన కార్యక్రమాలు, సంస్కరణలు, మానవాళికి ఉపయోగేపడే విధానాలు, పనులు నిర్వర్తించి వెళ్లిపోయారు. వారు ఏ పూజలు కోరుకోలేదు, ఏ కీర్తిని ఆశించలేదు. పాపం యన్.టి.ఆర్ గారు తనలోని కళారాధనను సంతృప్తి పరుచుకోవడానికి ఆ మహనీయులు ప్రతిరూపాలను నిర్మించి ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టించారు. ఇప్పుడేమో మనం వర్గాల వారిగా విడిపోయి ఆ మహనీయులను ద్వంసం చేయడానికి పూనుకొన్నాము. వారి ఆత్మ ఘోషిస్తుంది. ఎందుకు వారిని బాదపెట్టడం.. ఎక్కడో ఒక గదిలో ఏదొక మూలన వున్నా పర్లేదు.. ఏగొడవలు, విద్వంసాలు లేకుండా జీవితం ప్రశాంతంగా గడుస్తుంది వారికి. ఇంకా ఆ ట్యాంక్‌బండ్ మీద అలానే వుంచితే మళ్లీ ఏ మార్చో..లేక ఏ గర్జనో..లేక ఏ బాగో కార్యక్రమం లాంటివి తలపెట్టి మిగిలిన ఆ విగ్రహాలను కూడ ద్వంసం చేస్తారు.. అలా జరగకమునుపే మీరు త్వరపడి..వాటిని అక్కడ నుండి తరలించండి. ఆ విగ్రహాలకు మనస్సాంతిని కలిగించండి. త్వరపడండి.. ఈరోజు సంఘటన రేపటికి మరుపుని తెస్తుంది అది అనివార్యం కూడ.. మళ్లీ ఎప్పుడో ఇలాంటివి సంఘటనలు జరిగినప్పుడు మళ్లీ మనస్తాపం..! అలాంటివి మళ్లీ జరగకుండా త్వరపడండి
 

                                                                                    .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

   ఈ దఫా ఎనుబోతుల సుబ్బారెడ్డి లాంటి వాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారు.  టీంను పటిష్టంగా తయారు చేశారు. వీలైతే రైల్వేస్టేషన్‌లోనే అతన్ని లేపేయాలని వుంది వాళ్లకు.. లేదా గేటు బైటనయినా...!                
 ట్రైన్ వచ్చే సమయానికి పదినిమిషాల ముందుగా స్టేషన్‌కు చేరారు.  జనాల్లో కలిసిపోయి ఎదురు చూడసాగారు..
   ఐదునిమిషాలు గడిచాయో లేదో బూట్లు టకటక లాడించుకొంటూ ఇరువై మందిదాక పోలీసులు స్టేషన్‌లోకి ప్రవేశించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫ్లాట్ ఫాం అంతటా కలియ దిరుగుతూ ఎవరికోసమో వెదక సాగారు.
 శివపురి వాళ్లకు కొంత బెదురు పుట్టింది.
 తమ జేబుల్లో, బ్యాగిల్లో బాంబులున్నాయి.
 దొరికితే ప్రయత్నమంతా వృధా అవుతుంది.
 టెన్షన్ ఫీలవుతూ నిల్చుండి పోయారు.
  అంతలో ఫ్లాట్ ఫాం చివరినించి ఓ వ్యక్తిని లాక్కొచ్చారు పోలీసులు. అతని చేతిలో బ్రీఫ్ కేసుంది.
 అతని కోసమే వున్నట్టుంది వాళ్ల హంగామా అంతా.
 అతని చుట్టూ నిల్చున్నారు పోలీసులంతా.
 ’ మనిషి దొరికాడు గదా ! వెళ్లిపోతారనే అనుకొన్నాడు ’ రమణారెడ్డి
 అట్లా జరగలేదు.
 బ్రెఫ్ కేస్ ఓపెన్ చేశారు.
 దాన్నిండా బంగారు బిస్కట్లు.
 చూసే వాళ్లందరికీ కళ్లు బైర్లు కమ్మాయి.
 ఎవరో ప్రొద్దుటూరు వ్యాపారస్తుడట...!
 బంగారం స్మగ్లింగ్ చేస్తున్నాడని స్పష్టమైన ఫిర్యాదు అందటంతో సకాలంలో వచ్చి పట్టుకొన్నారు. మామూలుగా రాయలసీమలోని నాలుగు జిల్లాల వారు పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారు కొనుగోలు చేయడానికి రాయలసీమ నడిబొడ్డునున్న కడపజిల్లాలోని ప్రొద్దుటూరు తాలుకాకి వస్తారు. అక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటినుండి బంగారు, రతనాలు, వైడూర్యాలు రాశులుగా పోసి వీధుల్లో అమ్మే ఆనవాయితీ ఉండేది..! అలా వీధుల్లోరాశులుగా కాకున్నా అంగల్లలో అదే ఆనవాయితీ ఇప్పటికి కొనసాగుతూ వున్నది ఆ ప్రాంతంలో.  ముంబాయి నుండి భారతదేశంలోనే కొనుగోలు చేసేవారి శాతంలో70% పైగా ఈ ప్రొద్దుటూరు తాలుకా వారే కొనుగోలు చేస్తారట..!! అలా ముంబాయి నుండి బంగారు బిస్కెట్లు తెస్తూ అప్పుడప్పుడూ ఇలా పోలీసులకు పట్టుబడుతూ వుంటారు.
 అతనికి తోడుగా మరో వ్యక్తి వున్నాడని పోలీసుల అనుమానం
 దొరికిన వ్యక్తిని అక్కడే ఇంటరాగేట్ చేస్తున్నారు.
 పెద్ద హడావిడి సృష్టిస్తున్నారు.
 ట్రైన్ వచ్చే సమయమైంది.
చెన్నారెడ్డి స్టేషన్‌లో కాలుమోపే టైం దగ్గరబడింది.
 అతని మీద అటాక్ చేసేందుకు సిద్దమై వున్నారు రమణారెడ్డి వర్గంలోని ప్రతిమనిషి.
 అంతమంది పోలీసుల సమక్షంలో అది సాధ్యమయ్యే పనిగాదు.
అలాగని వాళ్లు ఇప్పుడిప్పుడే స్టేషన్ వదిలేట్టు లేరు.
 టెన్షన్‌గా వుంది.
 అంది వచ్చిన అవకాశం మరోసారి చేయిజారి పోయేట్టుంది.
 బాలుడయితే జుట్టు పీక్కున్నాడు.
 పోలీసుల ఇంటరాగేషన్ పూర్తి కాలేదు.
 బంగారు బిస్కట్లు బ్రీఫ్‌కేస్ మీంచి జనాల చూపులు ససేమిరా వెనక్కి రావటం లేదు.
శివపురి వాళ్ల ఆందోళనను రెట్టింపు చేస్తూ ట్రైన్ రానే వచ్చింది. అప్పుడే గేట్లోంచి స్టేషన్ లోపలికొచ్చారు ఓ ఇరువైమంది వ్యక్తులు,  వాళ్లంతా చెన్నారెడ్డికి సంబంధించిన వాళ్లు.
  సమాచారం అందుకొన్నట్లుంది. పగడ్బందీగా వచ్చారు.
ఫ్లాట్‌ఫాం మీద నిలబడుకొని చుట్టూ వున్న జనాల్ని గమనించసాగారు.
  వాళ్ల కళ్ల బడకుండా ముఖం చాటేసుకొన్నారు రమణారెడ్డి మనుషులు.
 మద్యలో పోలీసుల గుంపు వుంది.
 వాళ్ల ఇంటరాగేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
 అదే సమయంలో ట్రైన్ దిగాడు చెన్నారెడ్డి - తన నలుగురు అనుచరులతో.
 హడావిడిగా బైట్నించి వచ్చిన వాళ్లు అతన్ని చుట్టుకొని స్టేషన్ బైటకు తీసుకెళ్లారు.
 వాళ్లను ఫాలో చేయటంలో ఉపయోగం లేదని అర్థమైంది రమణారెడ్డికి.
 పోలీసుల విచారణ జరుగుతూనే వుంది.
 వాళ్ల మీద పీకల్దాక కోపమొచ్చింది బాలునికి.
 మంచి అవకాశాన్ని చెడగొట్టారు. ప్లానంతా నాశనం చేశారు.
 కొంత సేపు తల పట్టుకుండి పోయాడు.
 ఇంకా హడావిడి చేస్తోన్న పోలీసుల్ని చూస్తోంటే చురచుర మండుతోంది.  బంగారం దొరికింది. స్మగ్లర్ దొరికాడు. వెళ్లిపోవచ్చుగదా...!
 అంగట్లో లాగా బంగారాన్ని అందరిముందు ప్రదర్శిస్తూ తమ గొప్పదనాన్ని చాటుకోనేందుకు వేషాలు వేస్తున్నారు.
  ఆ బంగారపు బ్రీఫ్‌కేసు ముందునించే చెన్నారెడ్డి ధీమాగా నడుచుకొంటూ వెళ్లాడు.
 తమ చేతిలో తగినన్ని బాంబులు వుండి కూడా ఏం చేయలేక పోయారు.
 ఇప్పుడీ బాంబుల్ని పోలీసుల మీద విసరి బంగారాన్ని పట్టుకుపోతే ఎట్లా వుంటుంది..?
  జీవితాంతమయినా పార్టీ నడిపే సత్తా వస్తుంది గదా..!
 మంచి ఆర్థిక పుష్టి లభిస్తుంది గదా..!
 మనసులోని మాట జయసింహకు చెప్పాడు బాలుడు.
 అతను ’సై ’ అన్నాడు.
 మరి కొందరు వత్తాసిచ్చారు.
 బాంబులు విసరి పోలీసుల్ని తరమటం పెద్ద పనిగాదు.
 బంగారాన్ని తీసికెళ్లటం కష్టమేమీ కాదు.
 వాళ్ల రహస్య మంతనాల సారాంశం తెలీగానే ఉలిక్కిపడ్డాడు రమణారెడ్డి.
 జర జర దూరంగా లాక్కుపోయాడు బాలున్ని.
 " నీకేం బుద్దిందా ? లేదంటరా ? "  అన్నాడు. " డిపార్ట్‌మెంట్ మీంద బాంబులేస్చానంటావు. ఆలోచించే మాట్లాడుతున్నావా..? "  అంటూ మందలించాడు.  " ఉన్న కేసులు చాలవనా ?- పోలీసులతో కూడా గొడవపడటం !  డిపార్ట్‌మెంట్‌తో చెడ్డయి మనం తట్టుకోగలమా ? "
  " అదీ..  మరి  ఆనాకొడుకులు కదలకుంటేనూ.. "  తలగోక్కున్నాడు బాలుడు.
  జయసింహను కూడా పిల్చి మందలించాడు.
 తన వాళ్లందర్నీ తీసుకొని స్టేషన్ బైటక్కదిలాడు.
 అంతులేని నీరసం ఆవహించింది అందరికి.
 ప్రతి ప్రయత్నమూ చిన్న ఆటంకంతో విఫలం కావడం బాధాకరంగా వుంది. లక్ష్యాన్ని సాధించగలమా ?  లేదా ?  అనే సందేహం కూడా కలుగసాగింది.

        ***********

  దాడులు విఫలమయ్యేకొద్దీ రాజకీయంగా ఎదుగుదల కనిపిస్తూ వుంది. పలుకు బడి పెరుగుతూ వుంది. చిన్న చిన్న పంచాయితీలకు కూడా పిలుస్తున్నారు. ఏవైనా మండల స్థాయి సివిల్ వర్క్‌లకు టెండర్లలో పోటీ పడటం కూడా చాలిస్తున్నారు అవతలి వాళ్లు.. తమకు సంబంధించిన మూడు మండలాల్లో చాలా పనులు ఇనానిమస్‌గా తమకే దక్కుతున్నాయి.
 చెన్నారెడ్డి హవా కొంత వరకు తగ్గింది.
ఆఫీసుల్లో కూడా తమ పనులకు ఆటంకాలు కలుగటం లేదు.
 ఒక ధ్యేయంతో తాము ప్రయాణించాలనుకొంటే మరో లక్ష్యాన్ని తాము తాకేట్లున్నారు.
తాము ఆశించింది ఒకటి.
 అందుకోబోయేది మరొకటి.
 రాజకీయంగా తమ ఎదుగుదల తమకే స్పష్టంగా కన్పిస్తోంది.
  తాము ప్రయాణించాలనుకొన్న దారి ఇప్పుడు రెండుగా చీలి మరో వైపు ఆకర్షిస్తూ వుంది.
 ఈ పరిణామమంతా పసిగట్టినట్లున్నారు జి.పి.ఆర్ వగైరా పాత నాయుకులు.  ఈ మద్య కాలంలో మళ్లీ జనాల్లోకి రావటానికి ప్రయత్నిస్తున్నారు. తమను ఆసరా చేసుకొని పూర్వపు రాజకీయాల్ని పునరుద్దరించుకొనేందుకు నడుం బిగించబోతున్నారు.
  రమణారెడ్డికి ఓ విషయం స్పష్టంగ అర్థమవుతోంది.
 ఆవేశ పరుల ద్వారా చెన్నారెడ్డిని చంపించి తాము రాజకీయంగా పూర్వవైభవాన్ని పొందాలని వాళ్ల ఆలోచన.
 పని మూర్ఖులైన ఆవేశపరులు చేయాలి,.
 ఫలితం తాము అనుభవించాలి.
 తను ఆవేశపరుడేగాని మూర్ఖుడు కాదనే విషయం ఏదొకరోజు తెలిసి వస్తుంది లెమ్మనుకొన్నాడు రమణారెడ్డి,
 తనే తెలిసి వచ్చేలా చేయగలడు.
 అతని లక్ష్యం ఒక్కటే -
 ’పని తామే చేయాలి - ఫలితం కూడా తామే అనుభవించాలి ’  

                  *****************

  తన మీద రైల్వేస్టేషన్ వద్ద అటాక్ జరగబోయి పోలీసుల కారణంగా తృటిలో తప్పిపోయిందనే విషయం కొంత కాలం తర్వాత చెన్నారెడ్డికి తెలిసింది..
 అప్పట్నించి అతనికి ప్రాణ భయం పట్టుకొంది.
 తను ఎంతమంది ప్రివేటు వ్యక్తుల్ని రక్షణగా ఉంచుకొన్నా వాళ్లు లెఖ్కజేసేట్టు లేరు.
 పోలీసులే నయం లాగుంది.
 జి.పి.ఆర్ వద్ద అటాక్ జరిగినపటి నుండి పోలీసుల మీదే ఎక్కువ నమ్మకం వుంచుకొన్నాడు అతను. తన మీద జరిగిన దాడుల్ని ప్రాతి పదికగా ఎక్కువ సెక్యూరిటీ అరేంజ్ చేయించుకొన్నాడు.
  పోలీసులు లేకుండా బైటకు అడుగేయటం లేదు.
 ఏవైపునించి దాడి జరుగుతుంతో వూహించలేని పరిస్థితి. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థాయిలోనైనా జరగొచ్చు.
 తన మనుషులకు గతంలోలాగ ఆఫీసర్లు పలుకటం లేదని తెలుస్తోంది. దానికి కారణం తను ఆఫీసుల్ని దర్శించక పోవటమే.
 చావు ఎలాగూ వాళ్ల చేతుల్లో రాసిపెట్టున్నపుడు ఇంట్లో దాక్కుంటే తప్పిపోదు గదా !
  రాం పల్లె నించి తన ఫాలోయర్ నాగన్న వచ్చాడు.
 అతను నిత్యావసర వస్తువుల చౌకడిపో డీలర్.
 డి.డి కట్టినప్పటికీ ఎమ్మార్వో బియ్యం ఎత్తించలేదుట.
 అప్పటికే రెండుసార్లు వచ్చివున్నాడు తన వద్దకు అతను.
 ఇంట్లొంచి కదలక తప్పలేదు.
 ఏమయితే అదవుతుందని నలుగురు గన్‌మెన్‌లను వెంటేసుకొని జీపెక్కాడు.
 నేరుగా ఎమ్మార్వో ఆఫీసు వద్ద దిగాడు.
 టక టక చెప్పుల శబ్దం చేసుకొంటూ లోపలికెళ్లాడు.
ఉద్యోగులంతా లేచి నమస్కరిస్తోన్నా పట్టించుకోలేదు.
 ఎమ్మెల్లేను చూడగానే కుర్చీలోంచి నిటారుగా లేచి నిల్చున్నారు ఎమ్మార్వో.
లోపలికి వెళ్లి కుర్చీ లాక్కుని కూచున్నాడు చెన్నారెడ్డి.
 ఎమ్మార్వో కేసి చూస్తూ  " నేను ఎమ్మెల్లే చెన్నారెడ్డిని. చింతకుంట చెన్నారెడ్డిని...  గుర్తు పట్నెవా  ? .. "  అన్నాడు.
 " సార్ !...  సార్ !... "  అంటూ చేతులు కట్టుకొన్నాడు ఎమ్మార్వో.  అతనికి వెంటనే అర్థమైంది వెనకున్న నాగన్నను చూడగానే.
 " ఈ మద్య ఆఫీసులకు రావడం లేదులే...  మర్చిపోయానారేమోననీ "  ఎమ్మార్వో కళ్లల్లోకి సూటిగా చూశాడు.
 " సార్ !  మిమ్మల్ని మర్చిపోవడమేంది సార్ !.. సార్ - " చేతులు నలుపుకొంటూ అలాగే నిల్చున్నాడు.
  కూచోమన్నా కూచోలేదు.
 " సార్..  యీ నాగన్నకూ... "  అంటూ నసిగాడు సమస్య ఎమ్మెల్లే నోటినుంచి రాకముందే.
 " ఆ...  నాగన్నకు...? "
  " ఆయనకు బియ్యం ఎత్తియ్యొద్దని శివపురీ వాల్లు వార్నించ్చినారు సార్ ! డీలర్‌ను మార్చాలంట.. "  అతని గొంతులో సన్నని వణకు.
 " మార్చినారా...? "
 " లే.. లే..లేదుసార్ ! "
 " మరెందుకు సరుకెత్తీయలా ? "  గద్దించాడు.
 చేతులు పిసుక్కుంటూనే వున్నాడు ఎమ్మార్వో.
 " చూడు !... .. నా సంగతి నీకు తెల్దేమో ! పద్దతిగా నడిచ్చే నేను చాలా పద్దతయిన వాన్ని.  కారణం లేకుండా నా వాల్లకు అన్యాయం సేచ్చే నేను సహించను. ఏదైనా అవినీతి పన్జేస్తే సస్పెండ్ చేయండి. ఎవడో బెదిరించినారని వీల్లకు అన్యాయం సేచ్చే ఎట్లా ? నన్నూ బెదిరిచ్చనారు చంపుతామని..సంపుతారో... ఏమో !  నాకు పానాల మీద ఆశ లేదు...  ఏదొకరోజు చచ్చేవాన్నే ! నేను సచ్చేలోపల మీలాంటి వాల్ల అంతు జూస్చా...  జాగ్రత్త.. "  అంటూ హుంకరించాడు.
  అప్పటికే వొళ్లంతా పదురుతూ వుంది ఎమ్మార్వోకు.
 " ఎత్తిస్తా సార్... "  భయభ్రాంతుడవుతూ తలూపాడు.
 మరో సారి హెచ్చరించి వెళ్లి జీపెక్కాడు చెన్నారెడ్డి.
 అధికారుల్ని బెదిరించటంలో కొత్త సైలి వచ్చింది.
 తన వొళ్లంతా పట్టి పీడిస్తొన్న చావు భయం తెలివిగా వాడుకొంటున్నాడు.
 చుట్టూ నలుగురు పోలీసులూ, వాళ్లవద్ద అధునాతన ఆయుధాలు వున్నా అతనిలోని భయం తొలిగిపోవటం లేదు.  జీపు వెళుతోంటే పరిసరాలన్నిటినీ అనుమానంగానే చూస్తున్నాడు.  ఏ వైపునించి దాడి జరుగుతుందోనని భయపడుతున్నాడు.
 పార్టీ మీటింగ్‌లలో పాల్గొనటానికి జంకుతున్నాడు.
 పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు భయపడుతున్నాడు.
 తన్ను చూసి పరామర్శించడానికి వచ్చిన వాళ్లవద్దా, తనతో అరమరికలు లేకుండా మాట్లాడే వారివద్దా గుండెలు విప్పుతున్నాడు.  పల్లెల్నించి ఏదైనా పనిమీద టౌనుకొచ్చి ఎమ్మెల్లేను కలిసిపోదామని ఇంటి కొచ్చిన పెద్దమనషుల్తో  " మిమ్మల్ను మల్లా సూచ్చానో ! లేదో ! "  అంటూ బాధ పడుతున్నాడు.  మరీ సన్నిహితుల వద్ద కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నాడు.
 ఏ ఆఫీసరయితే తన వాళ్లకు పలుకలేదో, - అతని మీద దాడి జేస్తున్నాడు.  తనకెటూ చావు ఖాయమైందనీ, తనతో బాటు వాళ్లు కూడ రావాలని కోరుకోవద్దంటూ హితబోధ చేస్తున్నాడు.
 ఏది ఏమైనప్పటికీ చెన్నారెడ్డికి ఏర్పడిన చావు భయం చాలా మందికి తెలిసిపోయింది.  అదో చర్చగా కూడా మారింది.

                  *********

  ఆ రోజు డి.డి.ఆర్.సి సమావేశంలో పాల్గొనేందుకు కడప వెళ్లాడు.
మద్యాహ్నం తనకు ఆకలి కాకపోవటంతో పళ్లు తెప్పించుకు తింటూ గన్‌మెన్‌లను భోంచేసి రమ్మని చెప్పాడు.
 వాళ్లు వెళ్లగానే మంచం మీద నడుం వాల్చడు.
 కన్ను కూరకబోతోండగా ఫోన్ మోగింది.
 వాచ్‌మెన్ పరుగెత్తుకొంటూ వచ్చి రిసీవర్ ఎత్తి  " సార్ ! మీకే ఫోన్.. "  అంటూ అందించాడు.
 రిసీవర్ చెవికి ఆనించుకోగానే రమాదేవి గొంతు.
 అర్జంటుగా ఇంటికి వెళ్లాలిట.
 కారణం చెప్పేసరికి క్షణం కూడా నిలువబుద్ది కాలేదు.
 లేచి బట్టలు సవరించుకొని చెప్పుల్లో కాళ్లు దూర్చుతూ ప్రయాణమయ్యేసరికి గన్‌మెన్‌లు ఇంకా రాలేదనే విషయం అర్థమైంది.
 మరో పదినిమిషాలు నిరీక్షించాడు.
  సమస్య తీవ్రత ఎదలోపల రగులుతూవుంది.
 వెంటనే వెళ్లాల్సిన పరిస్థితి.
 గన్‌మెన్‌ల మీద కోపం తన్నుకొస్తూవుంది.
 ఒక్కడే వెళదామనుకొంటే గుండెలు చాలటం లేదు.
 తోడు లేకుండా వెళ్ల లేని పరిస్థితి.
 తన మీద తనకే జాలేసింది.
 వెంట జనం లేకుండా వెళ్లలేని తన పరిస్థితిని తల్చుకొని తనకే సిగ్గేస్తోంది.
 గన్‌మెన్‌ల ఆలస్యం పట్ల కోపం ఎక్కువైంది.
 ఆవేశంలో ముక్కుపుటాలు అదురుతున్నాయి.
 " ఎట్టబోయినారు ఈనా కొడుకులంతా ? ..  ఒక్కడూ లేడు.. యాడికి సచ్చినారు..? ఈనాకొడకల తోడు లేకుండా బైటికి పొయ్యేదానికి లేదు... థూ..ఏం బతుకో..?.. ఆ శివపురి నా కొడుకుల్ను ఏసేస్తే గాని నాకీ బాధ తప్పేట్టు లేదు, థూ.. థూ.. ఏం బతుకులో.. "  కసిగా తిట్టుకొంటూ అటు ఇటు పచార్లు చేస్తూ మండిపడుతున్నాడు.
 కొంతసేపటికి గన్‌మఎన్‌లు వచ్చారు.
 గొణుక్కొంటూనే వాళ్లతో కలిసి జీపెక్కాడు.
 అతనికి నిలువెల్లా అంతులేని అసహనంగా వుంది.
 తన స్వేచ్చలేని తనం పట్ల అసహనం....
తనను అనుక్షణం బెదిరిస్తూ వుండే చావు పట్ల అసహనం....
 తను ఎంత మేపినా సమయానికి అక్కరకు రాని జనం పట్ల అసహనం..
తన భార్య పట్ల అసహనం....
 తనకు తానుగా ఎక్కడికీ వెళ్లేందుకు లేదు. అది ఎంత ముఖ్యమైన పనయినా గన్‌మెన్‌లు లేకుండా కదలేడానికి లేదు.
  పెళ్లయిన కొత్తలో పొద్దుకూకే దాకా సేధ్యం జేసి ఆదరాబాదరా ఇంటికెళ్లి స్నానం జేసి అప్పుడు దారిబట్టి డ్రామ పద్యాలు పాడుకొంటూ పదిమైళ్లు నడిచి అత్తగారి వూరు చేరుకొనేవాడు.  రాత్రి పెళ్లాంతో గడిపి తెల్లారకముందే లేచి మళ్లీ ఒక్కడే నడుచుకొంటూ తన వూరికి వచ్చి పనుల్లో కలుసుకుండే వాడు.  తన రాకడ పోకడ ఎవ్వరికీ తెలిసేది కాదు....  ఎంత స్వేచ్చ..!  కళ్లాల్లో మంచ మేసుకొని తెల్లార్లూ హాయిగా నిద్రబోయే స్వేశ్చ మళ్లీ వస్తుందా..?  జీవితాన్ని ఎంత ఇరుకుగా చేసుకొన్నాడు తను!  రోజు రోజుకు తను నడిచే రహదారిని సానబట్టి సానబట్టి పదునైనా కత్తి వాదరగా మల్చుకొంటున్నాడు.  దానిమీద నడిచేంత కాలం ఏ స్వేచ్చా వుండదు.. ఏ మనశ్శాంతీ వుండదు.

                                                                                                          .........సశేషం

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs