వారంరోజుల క్రితం ఒక విషయసేకరణ కోసం కడప సి.పి.బ్రౌన్ లైబ్రరీకి వెళ్ళాను, అక్కడ రీసెర్చ్ అసిస్టెంట్ శ్రీ కట్టా నరశింహులు గారిని కలిసిన సందర్భంలో ఆయన కొన్ని తాళపత్రాల గ్రంధాలను తిరిగి రాస్తున్నారు. వాటిగురించి అడిగినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి, వారి వద్ద దాదాపుగా 120 తాళపత్రాల గ్రంథాలు సేకరించినవి వున్నాయి.  అంతకమునుపు 50 గ్రంధాలను శుద్దిచేసి తిరిగి దాతలకు అడిగినప్పుడు అప్పజెప్పినారు. ఉన్న 120 తాళపత్రాల గ్రంధాలలో " అముద్రిత " గ్రంథాలు రెండు ఉన్నాయట. వాటిలో కర్నూల్‌జిల్లా నందికొట్కూరు మండలము, పాతకోట గ్రామ వాస్తవ్యుడు  శ్రీ పోతురాజు పుల్లన రచించిన శివమహత్యం తెలిపే తొమ్మది అశ్వాశాల బ్రహ్మోత్తర ఖండమును కట్టా నరశింహులు గారు ఎత్తి రాస్తున్నారు.

       ఈ  పోతురాజు పుల్లన ఏ కాలంనాటి వారో తెలిపే చరిత్ర ఎక్కడా లేదు గాని ఆయన రచనా శైలిననుసరించి గమనిస్తే 16 వ శతాబ్దం తర్వాతవారై ఉండవచ్చునని  చెబుతున్నారు. ఆయన ఖండం నుండి ఒక పద్యం....

                           శ్రీరుద్రాంబుజ సంభవాచ్యుత ధరిత్రీపుత్రి మధ్యస్థతీ
                           స్ఫారోదార గభీర నిర్మల మహాపాతాళగంగాపయః
                           పూర ప్రాభవ కేళికాప్రియదయాంభోధీ శివా శ్రీనగా                       

                       గారా ! భర్మలి నిర్మిత స్ఫురిత సద్మా పద్మగర్భస్తుతా !










0 comments:

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs